రెడ్ అలర్ట్.. 11AM-4PM వరకు బయటకు రావొద్దు!
ఇప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు ఆంధ్రప్రదేశ్లోని ASF, ముంచంగిపుట్టు, పెదబయలు, ఖమ్మం, NLG, సూర్యాపేట, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో 45-47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే పలు జిల్లాల్లో వడగాల్పులు తీవ్రంగా వీచే అవకాశముందని APSDMA వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తరచుగా నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, ఎండలో ఎక్కువసేపు తిరగకపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
[embed]https://youtu.be/3SM9ibAXq7Q?si=fnGCJe-JU8gKCIhn[/embed]
MSc B.Ed.
Leave a Comment
Leave a Comment